అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగండం మరింత బలపడడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు (Rains) పడే అవకాశముందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీరా వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
రెండు రోజుల పాటు మత్స్యకారులు(Fishermans) చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం గంటకు 18 కి.మీటర్ల వేగంతో పశ్చిమబెంగాల్లోని దిఘాకు దక్షిణంగా 530 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఈ నెల 18 ఉదయం నాటికి బంగ్లాదేశ్లోని ఖేపుపార-మొంగ్లా మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు.