న్యూఢిల్లీ : ప్రతిరోజూ ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం (Breakfast) రోజంతా మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాంటి ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజూ లేవగానే చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్ధాలను బ్రేక్ఫాస్ట్లో భాగంగా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. దీంతో శక్తిహీనమై, బరువు పెరిగి ప్రీ డయాబెటిస్ పరిస్దితికి దారితీసే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
మూడు ఆహార పదార్ధాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే శరీరానికి హానికరమని న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా ఇన్స్టాగ్రాం పోస్ట్లో వెల్లడించారు. ఉదయాన్నే చాయ్ బిస్కెట్, బ్రేక్పాస్ట్ సిరల్స్, ఫ్రూట్ జ్యూస్లతో రోజు ప్రారంబిస్తే దీర్ఘకాలంలో మధుమేహ ముప్పు బారినపడే ప్రమాదం ఉందని తన పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక రోజూ ఉదయాన్నే టీ, కాఫీలతో పాటు ఫ్రూట్ జ్యూస్లు, సిరిల్స్, ఎనర్జీ బార్స్ను తీసుకోకూడదని స్పష్టం చేశారు. వీటితో రోజును ప్రారంభిస్తే ఇవి ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేయకపోగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారితీస్తాయని పేర్కొన్నారు.
కేఫిన్ అధికంగా ఉండే టీ, కాఫీలను కొద్దిగా తీసుకున్నా అవి రక్తంలో గ్లూకోజ్ను 50 శాతం వరకూ పెంచుతాయని ఆమె హెచ్చరించారు. మరి రోజూ లేవగానే వీటి బదులు ఏం తీసుకోవాలనే సందేహాలు వెంటాడుతుంటాయి. ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగి, శక్తి కోసం నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ను తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ సూచించారు. బ్రేక్ఫాస్ట్గా స్ప్రౌట్స్, ఎగ్స్, కూరగాయలు వంటి ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే వాటిని ఎంచుకోవాలని తెలిపారు.
Read More :