CWC 2023 Final: భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. కోల్కతాలో ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ తర్వాత ఇక ఈ టోర్నీలో ఒకటే మ్యాచ్ మిగిలుంటుంది. రెండో సెమీస్ విజేత.. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్తో జరుగబోయే మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఫైనల్ పోరుకు విశిష్ట అతిథి రానున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు దైనిక్ జాగరణ్ ఓ కథనంలో పేర్కొంది.
క్రికెట్ అభిమాని అయిన మోడీ గతంలో పలు సందర్భాల్లోనూ భారత్ ఆడిన మ్యాచ్లకు హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఆయన భారత్ – ఆస్ట్రేలియా మధ్య మార్చిలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగానే జరిగిన నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి హాజరైన విషయం తెలిసిందే. మోడీ రాకపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ప్రధాని హాజరవుతారన్న కథనాలైతే వెలువడుతున్నాయి.
Prime Minister Narendra Modi will attend the World Cup 2023 final. [Jagran News] pic.twitter.com/GX4C6YKcQi
— Johns. (@CricCrazyJohns) November 16, 2023
మోడీ రాకపై నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. మోడీ రాకతో భారత్ ఒత్తిడికి లోనవవుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది మాత్రం లక్ష మంది హాజరుకాబోయే మ్యాచ్ను మోడీ ఎందుకు వదులుకుంటారని, ఎలాంటి జనసమీకరణ లేకుండానే జనం దొరికితే ఫ్రీగా ప్రచారం చేసుకోవచ్చుననీ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇస్రో.. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైనప్పుడు కూడా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న మోడీ.. ఉన్నఫళంగా టీవీల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారని, భారత విజయాలలో ఆయన ప్రాతినిథ్యమేమీ లేకున్నా మోడీ తప్పకుండా అక్కడ ప్రత్యక్షమవుతారని వాపోతున్నారు.
AS- Dekho mere bete ne kaisi script likhi hai.
NaMo- Fir toh main bhi aata hu sunday ko match dekhne pic.twitter.com/IVvDiH6GUK— Digant (@keepitsimple176) November 16, 2023
He never loose any chance to be a part of Indian achievements pic.twitter.com/FRukR3qWWp
— Hemaram Saran (@saran_hemaram) November 16, 2023