PCB : వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్న పాకిస్థాన్ (Pakistan) ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. పాక్ గడ్డ మీదకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ (BCCI) అంగీకరించకపోవడంతో టోర్నీ వేదిక తరలే అవకాశముంది. హైబ్రిడ్ మోడల్కు గనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సిద్ధ పడకుంటే చివరకు దక్షిణాఫ్రికాలో చాంపియన్స్ ట్రోఫీని జరపాలని ఐసీసీ భావిస్తోంది. ఇదే విషయాన్ని పీసీబీకి తెలిజేసింది కూడా.
ఊహించని పరిణామంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన మొహ్సిన్ నఖ్వీ బృందం ఐసీసీని ఆశ్రయించింది. భారత జట్టు తమ దేశానికి రాకపోవడానికి కారణాలు ఏంటీ?, అసలు బీసీసీఐ ఏయే అభ్యంతరాలు చెప్పింది?.. ఆ వివరాలు కాస్త మాకు చెప్పండి అని ఐసీసీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరింది.
‘చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు భారత జట్టును పంపడం లేదని బీసీసీఐ నిర్ణయంపై స్పందన తెలియజేయాలని పీసీబీకి గత వారం ఐసీసీ లేఖ రాసింది. ఆ ఉత్తరంపై తాజాగా పీసీబీ స్పందించింది’ అని పీసీబీ మీడియా ప్రతినిధి తెలిపాడు. ఐసీసీకి రాసిన ప్రత్యుత్తరంలో టీమిండియా భద్రతకు ఢోకా ఉండదని స్పష్టం చేసింది.
🚨 ICC has asked PCB to adopt a hybrid model with India’s matches to be played in Dubai (UAE).
– If PCB doesn’t agree to a hybrid model, then the tournament might be shifted to South Africa 🇿🇦 entirely.
👉🏻 SA / IND Fans be like – “It’s time for Africa”😅#ChampionsTrophy2025 pic.twitter.com/rDbMBnnoIu
— Richard Kettleborough (@RichKettle07) November 12, 2024
ఈమధ్యే తమ దేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు పర్యటించిన విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు హైబ్రిడ్ మోడల్ లేదా దక్షిణాఫ్రికా వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరపాలని చూస్తే టోర్నీ నుంచి వైదొలిగేందుకు సిద్ధపడుతామని కూడా చెప్పినట్టు సమాచారం. బీసీసీఐ నిర్ణయం, ఐసీసీ లేఖ నేపథ్యంలో తదుపరి ఏం చేయాలనే విషయమై పాకిస్థాన్ ప్రభుత్వం సలహా తీసుకోవాలని పీసీబీ అనుకుంటోంది.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లోనే జరగాలి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకూ జరిగే టోర్నీ కోసం పీసీబీ కొత్త స్టేడియాల నిర్మాణం, పాత వాటి మరమ్మతు పనుల వేగం పెంచింది. కానీ, మొదటి నుంచి భారత జట్టును పాక్కు పంపేందుకు ఇష్టంగాలేని బీసీసీఐ చివరకు అదే మాటను ఐసీసీకి చెప్పింది. భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాక్కు పంపమని తెలియజేసింది.
దాంతో, టీమిండియా మ్యాచ్లను యూఏఈలో నిర్వహించేందుకు అంగీకరించాలని పీసీబీకి ఐసీసీ తెలియజేసింది.
PCB has written to the ICC that Pakistan maintain its stance of hosting champions trophy with or without India. (TOI). pic.twitter.com/Aw07vWHKOd
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2024
‘అలాకాదు.. కుదరదు’ అంటే మాత్రం టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. కొన్నిరోజులుగా చాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ.. త్వరలోనే వేదిక ఖరారు చేయడంతో పాటు పూర్తి షెడ్యూల్ను విడుదల చేసే దిశగా ఐసీసీ అడుగులు వేస్తోంది.