ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ లోయర్ ఆర్డర్ పోరాడింది. కానీ ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (28), ధవన్ (19) కొంత ఆడినా.. రాజపక్స (2), లియామ్ లివింగ్స్టన్ (3), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (0), హర్ప్రీత్ బ్రార్ (1), రిషి ధావన్ (4), రబాడ (6) ఎవరూ బ్యాటుతో ఆకట్టుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో జితేష్ శర్మ (44) జట్టును గెలిపించడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.
చివర్లో రాహుల్ చాహర్ (25 నాటౌట్) కూడా పోరాడాడు. కానీ అతనికి అవతలి ఎండ్ నుంచి సహకారం అందలేదు. అర్షదీప్ సింగ్ (2 నాటౌట్) కేవలం జట్టును ఆలౌట్ అవకుండా అడ్డుకోవడానికి సహాయపడ్డాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాయింట్ల విషయంలో సమానంగా ఉన్నా.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. ఆన్రిచ్ నోర్ట్జీ ఒక వికెట్ తీసుకున్నాడు.
That's that from Match 64@DelhiCapitals win by 17 runs and add two crucial points to their tally.
Scorecard – https://t.co/twuPEouUzK #PBKSvDC #TATAIPL pic.twitter.com/Szbwuradwo
— IndianPremierLeague (@IPL) May 16, 2022