ట్రినిడాడ్: వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు డ్రా కావడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship) పాయింట్ల పట్టికలో ఇండియా రెండో స్థానంలో ఉంది. టెస్టు చాంపియన్షిప్ రేసులో ప్రస్తుతం పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. విండీస్తో జరిగిన తొలి టెస్టు నెగ్గిన భారత్.. ఆ విక్టరీతో 16 పాయింట్లను సాధించగలిగింది. వాస్తవానికి రెండో టెస్టు నెగ్గితే ఇండియా ఖాతాలో 24 పాయింట్లు ఉండేవి. కానీ రెండో టెస్టు డ్రా కావడంతో .. టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇండియా రెండో స్థానంలో ఉంది. పీసీటీ(పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ వన్)లో ఇండియాకు 66.67 శాతం ఉంది. అయితే పాకిస్థాన్ మాత్రం 100 శాతం పీసీటీ సాధించింది. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్లో పాక్ తొలి టెస్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. డ్రా వల్ల నాలుగు పాయింట్లు సాధించిన విండీస్.. టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.
Big change at the top of the World Test Championship standings following the draw between the West Indies and India in Trinidad.#WTC25https://t.co/0RsIIqGSBy
— ICC (@ICC) July 25, 2023
విండీస్ సిరీస్తోనే ఇండియా తన టెస్టు చాంపియన్షిప్ కొత్త సైకిల్ను ప్రారంభించింది. ఈ సిరీస్ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో విదేశీ టూర్లు ఇండియా ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో స్వంత గడ్డపై ఇండియా ఆడనున్నది.