Loksabha Elections 2024 | రాహుల్ గాంధీ ఓ విఫల ప్రయోగమని, ఆయనను లాంఛ్ చేసిన ప్రతిసారీ కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. సాగర్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోహన్ యాదవ్ మాట్లాడారు. అసలు తానేం చేయదలుచుకున్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగినా రాహుల్ గాంధీని తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వం పడిపోయిందని అన్నారు.
2019లో రాహుల్ను తిరిగి లాంఛ్ చేసి, పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసినా కాంగ్రెస్కు 52 మంది ఎంపీలే దక్కారని, ఆపై ఆయన తన పదవి నుంచి వైదొలిగారని మోహన్ యాదవ్ గుర్తుచేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఎదురైంది. బినా కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే ఆదివారం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు.
పార్టీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ నేతలు వరుసగా బీజేపీలో చేరుతుండటంతో రాష్ట్రంలో ఆ పార్టీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోంది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ను వీడటం ఆ పార్టీ అగ్రనేతలను కలవరపరుస్తోంది.
Read More :
Snakes | ప్యాంటులో పాములు.. ఎయిర్పోర్టులో పట్టుబడిన ప్రయాణికుడు