India Davis Cup Team : భారత డేవిస్ కప్ జట్టుకు పాకిస్థాన్ వీసా(Pakistan Visa) దొరికింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషనర్ కార్యాలయం శనివారం రోహిత్ రాజ్పాల్(Rohit Rajpal) బృందానికి వీసాలు జారీ చేసింది. దాంతో, దాదాపు 60 ఏండ్ల తర్వాత టీమిండియా దాయాది గడ్డపై కాలుమోపనుంది. ఫిబ్రవరిలో డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 ప్లే ఆఫ్స్(World Group 1 Play Offs) ఆడేందుకు భారత బృందం పాకిస్థాన్కు వెళ్లనుంది. ఇస్లామాబాద్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో డైవిస్ కప్ టై మ్యాచ్ జరుగనుంది.
భారత డేవిస్ కప్ జట్టు తొలిసారి 1964లో పాక్కు వెళ్లింది. ఆ ఏడాది లాహోర్లో జరిగిన మ్యాచ్లో భారత్ 4-0 తో పాక్ను చిత్తు చేసింది. 2019లోకజకిస్థాన్ వేదికగా దాయాదులు తలపడిన టై మ్యాచ్లోనూ భారత్ 4-0తో విజేతగా నిలిచింది. దాంతో, 2019లో మాదిరిగానే ఈసారి కూడా తటస్థ వేదికపై టై మ్యాచ్ నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ITF)ను భారత టెన్నిస్ సమాఖ్య అధికారులు కోరారు.
Courage, commitment, and camaraderie – bcz it’s the time for the National Duty🎾🇮🇳
Team India at the Delhi Gymkhana Club, gearing up for the Davis Cup World Group 1 Playoff against Pakistan.
Every stroke is a step closer to victory. Let’s rally behind our champions! @DavisCup pic.twitter.com/YFwE1B5Jqh
— All India Tennis Association (@AITA__Tennis) January 25, 2024
కానీ, ఐటీఎఫ్ సభ్యులు అందుకు అంగీకరించలేదు. దాంతో, ఈసారి భారత జట్టు టై మ్యాచ్ కోసం పాక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న భారత బృందం అక్కడి జింఖానా గ్రౌండ్లో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటోంది. ఈ బృందంలో సభ్యుడైన సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న పాకిస్థాన్కు వెళ్లడం లేదు. ఈ స్టార్ ప్లేయర్ 43 ఏండ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ వెళ్లనున్న డేవిస్ కప్ బృందం : రోహిత్ రాజ్పాల్(కెప్టెన్), యుకీ బ్రాంబీ, రామ్కుమార్ రామనాథన్, ఎన్.శ్రీరాం బాలాజీ, సాకేత్ మైనేని, నికీ కలియండా పూనచ, దిగ్విజయ్ ఎస్డీ ప్రజ్వల్ దేవ్(రిజర్వ్).