Ravindra Jadeja : ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా కంగుతిన్న భారత జట్టు మరో షాకింగ్ న్యూస్. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రెండు టెస్టుకు దూరం కానున్నాడు. రెండో ఇన్నింగ్స్లో రనౌట్గా వెనుదిరిగిన జడ్డూ.. తొడ కండరాల నొప్పి(Harmstring Injury)తో బాధపడుతున్నాడు. పరుగుల వద్ద రనౌట్ అయిన జడేజా ఇబ్బందిపడుతూ నడుస్తూనే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు.
మ్యాచ్ అనంతరం హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)ను జడేజా ఆరోగ్యం గురించి అడుగగా.. ‘నేనింకా ఫీజియోతో మాట్లాడలేదు. అతడితో మాట్లాడాక జడేజా ఆడేది? లేనిది? చెప్తాం’ అని తెలిపాడు. ఫిబ్రవరి 2న విశాఖపట్టణంలో జరిగే రెండో టెస్టుకు ముందే జడేజా ఆరోగ్యంపై ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఒకవేళ అతడు మ్యాచ్కు దూరమైతే కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)కు తుది జట్టులో చోటు దక్కవచ్చు.
RUN OUT!
Superb from Ben Stokes, Jadeja is short – India SIX down 😱https://t.co/cLDBNAmkmy | #INDvENG pic.twitter.com/WniP5O89L9
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ జరిగిన తొలి టెస్టులో జడేజా అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం బంతితోనూ చెలరేగి మూడు కీలక వికెట్లు తీశాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్లో కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న జడ్డూ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
బెన్ స్టోక్స్ విసిరిన బంతి నేరుగా వికెట్లును తాకడంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్(28), శ్రీకర్ భరత్(28)లు పోరాడినా ఓటమిని తప్పించలేకపోయారు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హర్ట్లే 7 వికెట్లు తీసి భారత్కు ఘోర పరాభవాన్ని అందించాడు. ఈ ఓటమితో రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్సిప్ పట్టికలో ఐదో స్థానానికి పడపోయింది.