Saud Shakeel : పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్(Saud Shakeel) నయా చరిత్ర లిఖించాడు. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ(Double Century) చేసిన తొలి పాక్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. గాలే స్టేడియం(Galle International Stadium)లో లంకతో జరుగుతున్న తొలి టెస్టులో షకీల్ అజేయ ద్విశతకంతో రాణించాడు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించని చోట.. షకీల్ 361 బంతుల్లో 208 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 19 ఫోర్లు ఉన్నాయి.
నిరుడు ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్కు ఇది 6 మ్యాచ్ కాగా.. ఇప్పటికే ఓ సెంచరీ 5 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. భవిష్యత్తు బాబార్ ఆజమ్(Babar Azam) అని పేరు తెచ్చుకుంటున్న షకీల్.. పక్కా క్రికెటింగ్ షాట్లతో చెలరేగడం చూసి విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
.@saudshak tumbles records in Galle 👏
A dream start to his career as he has amassed 788 runs at an average of 98.5 🌟#SLvPAK pic.twitter.com/De1S1AFpWT
— Pakistan Cricket (@TheRealPCB) July 18, 2023
ఓవర్నైట్ స్కోరు 221/5తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్.. చివరకు 461 పరుగులకు ఆలౌటైంది. షకీల్ డబుల్ సెంచరీకి.. ఆఘా సల్మాన్ (83) అర్ధశతకం తోడవడంతో పాకిస్థాన్ మంచి స్కోరు చేయగలిగింది. అయితే.. డబుల్ సెంచరీకి ముందు కాస్త ఉత్కంఠ నెలకొనగా.. చివరి వరుస బ్యాటర్ నసీమ్ షా (78 బంతుల్లో 6) షకీల్కు అండగా నిలిచాడు.
సౌద్ షకీల్(208), నసీమ్ షా(6)
ఈ జోడీ 9వ వికెట్కు 94 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5, ప్రభాత్ జయసూర్య 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక వికెట్ నష్టపోకుండా 14 పరుగులుచేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్నాఇంకా 135 పరుగులు వెనుకబడి ఉంది.