KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పోటెత్తుతున్నారు. బస్సు యాత్ర వెనుక కదలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వీణవంకలో రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన జగిత్యాల జిల్లాకు బయల్దేరారు. దారి మధ్యలో కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఆగి అక్కడ సమోసా తిని ఛాయ్ తాగారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేతను చూసిన యువతీయువకులు సంబురాల్లో మునిగిపోయారు. కేసీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు ఆసక్తి చూపించారు. వాళ్లతో ఫొటోలు దిగిన అనంతరం కేసీఆర్ జగిత్యాలకు బయల్దేరి వెళ్లారు.