Asia cup 2023 : ఆసియా కప్లో కీలకమైన సూపర్ 4 మ్యాచ్కు పాకిస్థాన్(Pakistan) అన్ని విధాలా సిద్ధమవుతోంది. లాహోర్ వేదికగా బంగ్లాదేశ్తో రేపు జరుగనున్న మ్యాచ్ కోసం బాబర్ ఆజాం(Babar Azam) సేన ఈరోజే తుది జట్టును ప్రకటించింది. పల్లెకెలె స్టేడియంలో భారత్పై విఫలమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్(Mohammad Nawaz)ను పక్కనపెట్టేసింది. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ ఫహీం అష్రఫ్(Faheem Ashraf)ను తీసుకుంది. దాంతో, పాక్ బౌలింగ్ యూనిట్ మరింత బలంగా మారనుంది.
ఫహీం అష్రఫ్, మహమ్మద్ నవాజ్
పాకిస్థాన్ తుది జట్టు : బాబర్ ఆజాం(కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫహీం అష్రఫ్, నసీం షా, షాహీన్ ఆఫ్రీదీ, హ్యారిస్ రవుఫ్.
Our playing XI for the Super 4 match against Bangladesh 🇵🇰💪#AsiaCup2023 | #BackTheBoysInGreen pic.twitter.com/kEfGMsvsgr
— Pakistan Cricket (@TheRealPCB) September 5, 2023
సెప్టెంబర్ 2న భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇషాన్ కిషన్(82), హార్దిక్ పాండ్యా(87) దెబ్బకు నవాజ్ 8 ఓవర్లలో ఏకంగా 55 రన్స్ సమర్పించుకున్నాడు. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా 9 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చాడు. ఈ టోర్నీలో భారత్, పాక్ సెప్టెంబర్ 10న మరోసారి ఎదురు పడనున్నాయి. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి.