PCB : టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) కీలక నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ యూనిట్పై ప్రత్యేక దృష్టి పెట్టిన పాక్ సెలెక్టర్లు.. న్యూజిలాండ్ (Newzealand)తో జరుగబోయే పొట్టి సిరీస్కు పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. మంగళవారం పీసీబీ వెల్లడించిన 17మందితో కూడిన స్క్వాడ్లో స్పీడ్స్టర్ మహ్మద్ అమిర్ (Mohammad Amir), పాకిస్థాన్ సూపర్ లీగ్ హీరో ఇమాద్ వసీం(Imad Wasim)లకు చోటు దక్కింది.
పాక్ పేసర్గా రాణిస్తున్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది. దాంతో, అతడు 2021లో ఆటకు గుడ్ బై చెప్పేశాడు. అయితే.. టీ20 లీగ్స్లో కొనసాగాడు. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్లో అమిర్ అద్భుత ప్రదర్శన చేశాడు. పొట్టి ప్రపంచకప్ ఆడాలనే ఉద్దేశంతో ఈ స్పీడ్స్టర్ వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
🚨 Pakistan squad for five-match T20I series against New Zealand 🚨
Read more ➡️ https://t.co/qnTIhuJYMd#PAKvNZ | #BackTheBoysInGreen pic.twitter.com/Wa0rjJjJ62
— Pakistan Cricket (@TheRealPCB) April 9, 2024
మరోవైపు ఇమాద్ సైతం పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున అదరగొట్టాడు. సంచలన ఇన్నింగ్స్తో ఇస్లామాబాద్కు ట్రోఫీ కట్టబెట్టాడు. దాంతో, ఊహించనట్టుగానే అతడికి టీ20 జట్టులో చోటు దక్కింది. కివీస్తో ఐదు టీ20ల సిరీస్ ఏప్రిల్ 18న ప్రారంభం కానుంది.
వన్డే వరల్డ్ కప్లో వైఫల్యం తర్వాత పాక్ జట్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షాహీన్ ఆఫ్రిది సారథ్యంలోని పాక్.. న్యూజిలాండ్ చేతిలో పొట్టి సిరీస్ కోల్పోయింది. అనంతరం రెండు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలోనూ చావు దెబ్బతిన్నది. కెప్టెన్గా, బౌలర్గా షాహీన్ ఆఫ్రిది ఘోరంగా విఫలమయ్యాడు. ఈమధ్యే బాబర్ ఆజాం మళ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు పాక్ ఆటగాళ్లంతా సైనికుల పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొందుతున్నారు.