Cyber Fraud : నకిలీ ఈ-చలాన్స్తో సైబర్ నేరగాళ్లు రూటుమార్చి వాహనాదారులను నిండా ముంచేస్తున్నారు. నకిలీ ఈ-చనాల్స్ టెక్ట్స్ మెసేజ్లను పంపడంతో వాటిలో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసిన వాహనదారులు పెద్దమొత్తంలో మోసాలకు గురవుతున్నారు. ఈ-చలాన్స్లో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఇతర వివరాలు సక్రమంగా ఉండటంతో అవి సరైనవేననే నమ్మకంతో బాధితులు వాటిని క్లిక్ చేస్తూ పెద్దమొత్తంలో పోగొట్టుకుంటున్నారు.
ఇక లేటెస్ట్గా ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఈ తరహా ఫిషింగ్ స్పామ్ ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకున్న అనంతరం రూ. 3 లక్షలు పోగొట్టుకున్నారు. పెద్దార్ రోడ్ ప్రాంతంలో నివసించే బాధితుడికి తన కారుపై ఈ-చలాన్కు సంబంధించిన ఎస్ఎంఎస్ రాగా, అందులో వివరాలను నిర్ధారించుకుని ఆపై ఫైన్ చెల్లించేందుకు వ్యాపారి సిద్ధమయ్యారు. మెసేజ్లో వివరాల ఆధారంగా వాహన్పరివాహన్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు.
ఆపై యాప్ ద్వారా పేమెంట్ చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే ఓ వారం తర్వాత తన క్రెడిట్ కార్డ్ నుంచి దాదాపు 31 లావాదేవీలు జరిగినట్టు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. రూ. 3 లక్షల వరకూ పోగొట్టుకోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Lok Sabha Elections | ‘మహా’కూటమిలో సీట్ల సర్దుబాటు ఫైనల్.. ఎవరెన్ని స్థానాల్లో పోటీ అంటే..!