SRH : ఐపీఎల్ 17వ సీజన్లో తెలుగు అభిమానుల ఇష్ట జట్టు సన్రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) మరో మ్యాచ్కు సిద్ధమైంది. కొత్త సంవత్సరాది ఉగాది రోజున మొహాలీలోని ముల్లన్పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే పంజాబ్ చేరుకున్న కమిన్స్ సేన మ్యాచ్ కోసం నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతోంది. ఉగాది సందర్భంగా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఓ వీడియోలో తెలుగు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. అందులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, పేస్ త్రయం జయాదేవ్ ఉనాద్కాట్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్లు ‘హ్యాపీ ఉగాది. మీకు మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశారు. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సర ఉగాదిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కుటుంబంతో సంబురంగా చేసుకుంటున్నారు.
‘Tis the festive season, #OrangeArmy! 😄 Here’s to wishing you all a memorable Ugadi 🧡🌸 pic.twitter.com/rk5WbOYXok
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
పదహారో సీజన్లో నిరాశపరిచిన హైదరాబాద్ 2024 ఎడిషన్లో అదరగొడుతోంది. సొంతగడ్డ మీద ముంబై ఇండియన్స్పై ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్కోర్(277 పరుగులు) కొట్టింది. ఆ తర్వాత ఉప్పల్లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుగా ఓడించి రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కమిన్స్ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్తో పాటు తర్వాతి మ్యాచుల్లోనే గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్ బెర్తు దక్కే పరిస్థితి లేదు. దాంతో, ఇకపై ప్రతి గేమ్ను ఆరెంజ్ ఆర్మీ సీరియస్గా తీసుకోనుంది.