WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) తేదీ ఖరారైనప్పటి నుంచి ఓవల్(Oval) స్టేడియం వార్తల్లో నిలిచింది. అక్కడ గెలుపు ఎవరిది? పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా? లేదంటే బ్యాటర్లకు స్వర్గధామంగా నిలుస్తుందా? అనే చర్చల ఊపందుకున్నాయి. మరో రెండు రోజుల్లో ఫైనల్ ఫైట్ ఉందనగా.. ఓవల్ పిచ్ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. జూన్ 7న భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇదే పిచ్పై ఫైనల్లో తలపడనున్నాయి.
పచ్చిక ఉన్న ఆ పిచ్ గురించి ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘గ్రీన్ గార్డెన్’ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘పిచ్ మీద గడ్డి ఎక్కువ ఉంది’ అని మరికొందరు పోస్ట్ చేశారు. గత మ్యాచ్ ఫలితాలను బట్టి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహరిస్తుందని చెప్తున్నారు. అదే జరిగితే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్తో కూడిన ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెద్ద సవాలే. అయితే.. షమీ, సిరాజ్ కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టగలరు.
ఈ స్టేడియలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో తెలుసా…? ఇప్పటి వరకు ఈ వేదికపై టీమిండియా 14 టెస్టులు ఆడింది. కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఐదు టెస్టులో ఓడింది. 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇండియా ఓవల్ స్టేడియంలో 1936లో తొలి మ్యాచ్ ఆడింది. అయితే.. ఆ గేమ్లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఓడిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై 1971లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. మూడో టెస్టులో 4 వికెట్లతో భారత్ గెలుపొందింది. అతర్వాత మళ్లీ 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని యువ భారత్ ఇంగ్లండ్ను చిత్తు చేసింది.