IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరుమీదున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు బిగ్ షాక్. యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. కాలి పిక్కల గాయంతో బాధపడుతున్న పుతూర్ మిగతా మ్యాచ్లకు దూరం అయ్యాడు. దాంతో, అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ అయిన రఘు శర్మ(Raghu Sharma)ను తీసుకుంది ముంబై. ఈ విషయాన్ని గురువారం ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
‘గాయపడిన విఘ్నేశ్ జట్టుతోనే ఉంటాడు. అతడిని మా వైద్య బృందం పర్యవేక్షిస్తుంటుంది. విఘ్నేశ్ స్థానంలో నెట్ బౌలర్గా ఉన్న 32 ఏళ్ల రఘును స్క్వాడ్లోకి తీసుకుంటున్నాం. విఘ్నేశ్ నువ్వు త్వరగా కోలుకోవాలని మన ముంబై కుటుంబం కోరుకుంటోంది. నిన్ను త్వరలోనే మైదానంలో చూడాలనుకుంటున్నాం ‘అని ముంబై ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన లెగ్ స్పిన్తో వికెట్ల వీరుడిగా పేరొందిన రఘుతో రూ.30లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుంది యాజమాన్యం.
𝐑𝐚𝐠𝐡𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐬 𝐕𝐢𝐠𝐧𝐞𝐬𝐡 𝐏𝐮𝐭𝐡𝐮𝐫 𝐚𝐭 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐫𝐞𝐬𝐭 𝐨𝐟 #TATAIPL 𝟐𝟎𝟐𝟓 𝐬𝐞𝐚𝐬𝐨𝐧.
📰 Read more ➡ https://t.co/n9MJ7PvqlQ#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/a9Ia6XxLlZ
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ 18వ ఎడిషన్లో ముంబై తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్పై 3 వికెట్లతో మెరిసిన ఈ లెగ్ స్పిన్నర్.. మొత్తంగా 5 మ్యాచుల్లో 9.08 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. ఆడింది కొన్ని మ్యాచ్లే అయినా.. తన ఆకట్టుకున్నాడు. అంతలోనే అతడు గాయంతో టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది.
Get well soon, Vignesh 🥹
Your #OneFamily wishes you a speedy recovery & we can’t wait to see you back on the field soon 💙#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/Yej0ylKT6z
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
రఘు విషయానికొస్తే.. 2024-25 సీజన్లో అత్యుత్తమంగా రాణించాడు. పంజాబ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. 8 మ్యాచుల్లో 14 వికెట్లతో రాణించిన రఘు 11 ఫస్ల్ క్టాస్ మ్యాచ్లు ఆడాడు. బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. ఐదుసార్లు 5 వికెట్లు.. మూడు దఫాలు 10 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏతో పాటు పంజాబ్, పాండిచ్చేరి తరఫున 3 టీ20లు ఆడిన అనుభవం ఉంది.