MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ప్రపంచం క్రికెట్లోని బెస్ట్ ఫినిషర్లలో ఒకడు. సొంత గడ్డపై 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధనాధన్ ఇన్నింగ్స్తో శ్రీలంకకు కన్నీళ్లు మిగిల్చిన ధోనీ.. లంకేయులపైనే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేయడం విశేషం. ధోనీ 183 పరుగుల ఇన్నింగ్స్కు నేటితో 18 ఏండ్లు. 2005, అక్టోబర్ 31న ఈ జార్ఖండ్ డైనమైట్ లంక బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగింగించి సెంచరీ కొట్టాడు. ధోనీ కెరీర్లో గొప్ప ఇన్నింగ్స్గా నిలిచిపోయిన ఈ రోజును బీసీసీఐ గుర్తు చేసుకుంది. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న ధోనీ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది.
🗓️ #OnThisDay in 2005
Former #TeamIndia Captain MS Dhoni scored a blistering 1⃣8⃣3⃣* off 145 deliveries, smashing 15 fours & 10 sixes and notched up his highest score in ODIs💥@msdhoni pic.twitter.com/LfH8ww8CeG
— BCCI (@BCCI) October 31, 2023
కెరీర్ తొలినాళ్లలో జులపాల జుట్టుతో ప్రత్యేకంగా కనిపించిన మహీ.. జైపూర్ వేదికగా లంకతో జరిగిన వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 40 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండ్రీకి పంపాడు. అలా కేవలం 145 బంతుల్లో 183 పరుగులు సాధించాడు. మహీ సుడిగాలి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 10 సిక్స్లు ఉన్నాయి. దాంతో, లంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు మరో 23 బంతులు ఉండాగానే ఛేదించింది. విశాఖపట్టణంలో పాకిస్థాన్పై కూడా ధోనీ వీరోచిత సెంచరీతో ఔరా అనిపించాడు.
2007లో భారత జట్టు పగ్గాలు అందుకున్న మహీ భాయ్.. అనతికాలంలోనే తన ముద్ర వేశాడు. టీమ్ఇండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిపెట్టాడు. ధోనీ సారథ్యంలోని భారత్ 2007లో పొట్టి ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన మార్క్ చూపిస్తున్నాడు. 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను చాంపియన్గా నిలిపి తన కెప్టెన్సీకి తిరుగులేదని మరోసారి చాటుకున్నాడు.