Team India – Miss world : వెస్టిండీస్ పర్యటనలో దుమ్మురేపుతున్న టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. పోర్ట్ అఫ్ స్పెయిన్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లను చేసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. మూడో రోజు మరొక ఆసక్తికర సంఘటన జరిగింది. మిస్ వరల్డ్ ట్రినిడాడ్, టొబాగో అషె అబ్రహమ్స్(Aché Abrahams) భారత యువ క్రికెటర్లతో ముచ్చటించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్తో కాసేపు మాట్లాడిన ఆమె ఆ తర్వాత వాళ్లతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలను ట్విట్టర్లో పెట్టింది.
‘వీళ్లు చాలా స్వీట్. వాళ్లను మా నగరంలోకి అహ్వానిస్తున్నా. భారత్ నుంచి వచ్చిన మా బ్రదర్స్ను కలిసినందుకు సంతోషంగా ఉంది’ అని అబ్రహమ్స్ వాటికి క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అమె ఈ ఏడాది భారత్లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననుంది.
Miss World Aché Abrahams from Trinidad & Tobago meets Indian cricketers Shubman Gill, Yashasvi Jaiswal, and Ishan Kishan, expressing her delight and excitement during their interaction.
📸: RevSportz pic.twitter.com/dyVo4FpvNt
— CricTracker (@Cricketracker) July 22, 2023
సెంచరీ హీరో విరాట్ కోహ్లీని, విండీస్ వికెట్ కీపర్ జాషువా డాసిల్వా (Joshua Da Silva) హత్తుకొని భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. డాసిల్వా తల్లి విరాట్కు వీరాభిమాని. అతడిని చూసేందుకు ఆమె స్టేడియానికి వచ్చిందని తెలిసి కోహ్లీ ఎంతో సంతోషించాడు.
విరాట్ కోహ్లీ (121)
రెండో టెస్టులో టీమిండియా 438 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదొందల మ్యాచ్లో కోహ్లీ(121) చిరస్మరణీయ సెంచరీకి తోడు రోహిత్ శర్మ(80), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56), యశస్వీ జైస్వాల్(57) అర్ధ శతకాలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు.