బెంగుళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నది. ఈ రెండు జట్లూ ప్లే ఆఫ్స్ కోసం కుస్తీపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే సీఎస్కే జట్టు స్టేడియంకు చేరుకున్నది. అయితే ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్కు ధోనీ(Dhoni) వెళ్లాడు. అక్కడ అతను కాసేపు గడిపారు. ప్లేయర్లతో కలిసి టీ తాగారు. ఆర్సీబీ జట్టు తన ఇన్స్టాగ్రామ్లో ధోనీకి వెల్కమ్ చెబుతూ వీడియోను పోస్టు చేసింది.
కీలకమైన ఈ మ్యాచ్లో ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే ఆర్సీబీ భారీ తేడాతో సీఎస్కేపై విజయం నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం 20 పరుగుల తేడాతో నెగ్గితేనే ఆర్సీబీకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ భారీ తేడాతో నెగ్గకపోతే.. అప్పుడు సీఎస్కే ఓడినా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు ఎంట్రీ ఇచ్చిన మూడవ జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. గురువారం మ్యాచ్ రద్దు కావడంతో హైదరాబాద్ రూట్ క్లియర్ అయ్యింది.
View this post on Instagram
A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)