దుబాయ్: అమెరికాలో జూన్ ఒకటో తేదీ నుంచి టీ20 వరల్డ్కప్( T20 World Cup) మ్యాచ్లు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఇండియా తలపడనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఆ మ్యాచ్కు చెందిన వేదికని త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పింది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. దీంట్లో 17 జట్లు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఆ మ్యాచ్లు మే 27 వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. అమెరికా, ట్రినిడాడ్ అండ్ టోబాగో వేదికల్లో మ్యాచ్లు ఉంటాయని ఐసీసీ చెప్పింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు మాత్రం వార్మప్ మ్యాచ్లు ఆడడం లేదు.
ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మే 22వ తేదీ నుంచి నాలుగు మ్యాచ్ల ద్వైపాక్షి సిరీస్ జరగనున్నది. న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్ను జూన్ 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో ఆడనున్నది. టెక్సాస్లోని గ్రాండ్ ప్రైరరీ క్రికెట్ స్టేడియం, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో 16 వార్మప్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వీన్స్ పార్క్ ఓవర్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య మే 30వ తేదీన జరగనున్న మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించారు.
Warm-up matches locked in as teams finalise #T20WorldCup preparations 💪
Details 👉 https://t.co/gK77tLd7kN pic.twitter.com/7bD5laV04u
— ICC (@ICC) May 17, 2024