SL vs AFG 2nd T20 : స్వదేశంలో అఫ్గనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ను ఒడిసిపట్టిన శ్రీలంక(Srilanka) టీ20 సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) విజృంభించడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను పట్టేసింది. సోమవారం దంబుల్లా స్టేడియంలో జరిగిన రెండో టీ20లో లంక 72 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది.
తొలుత బ్యాటుతో చెలరేగిన మాథ్యూస్(42 నాటౌట్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆ తర్వాత బంతితోనూ రెండు వికెట్లు తీసి కాబూలీలను దెబ్బకొట్టాడు. దాంతో పర్యాటక జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. లంక విజయంలో కీలక పాత్ర పోషించిన మాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
A dominant performance secures a MASSIVE 72-run win against Afghanistan, clinching the series with one match to go! 🎉 🇱🇰 #SLvAFG pic.twitter.com/GQUVx4lRqE
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 19, 2024
మొదటి టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచిన లంక రెండో మ్యాచ్లోనూ రఫ్ఫాడించింది. అఫ్గనిస్థాన్ బౌలర్లను ఉతికారేస్తూ సమరవిక్రమ(51) హాఫ్ సెంచరీ బాదా.. ఆ తర్వాత వచ్చిన మాథ్యూస్(42 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడడంతో లంక 6 వికెట్ల నష్టానికి 186 రన్స్ కొట్టింది. అనంతరం భారీ ఛేదనలో అఫ్గన్ ఓపెనర్లు హజ్మతుల్లా జజాయ్(1), ఇబ్రహీం జర్డాన్(10)లను మాథ్యూస్ ఔట్ చేసి లంకకు బ్రేక్ ఇచ్చాడు.
An all-round performance from Angelo Mathews 👏 #ICYMI, the veteran allrounder was the Player of the Match last night in Dambulla 🏆 https://t.co/S7pLlBaBk0 #SLvAFG pic.twitter.com/bzPpOrpSHM
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2024
కానీ, మహ్మద్ నబీ(27), కరీం జన్నత్(28)లు కాసేపు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. పథిరన, బినుర ఫెర్నాండోలు తలా రెండేసి వికెట్లు తీయడంతో అఫ్గనిస్థాన్ 17వ ఓవర్లో 115 పరుగులకే ఆలౌట్ అయింది. నామమాత్రమైన మూడో టీ20 దంబుల్లాలో ఫిబ్రవరి 21న జరుగనుంది.