Paris Olympics 2024 : నిరుడు ఆసియా క్రీడల్లో(Asian Games 2023) పతకంతో చరిత్ర సృష్టించిన భారత యువకెరటం అనుష్ అగర్వల్లా(Anush Agarwalla) ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించాడు. ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్(Dressage) విభాగంలో అతడు విశ్వ క్రీడలకు క్వాలిఫై అయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య (EFI) వెల్లడించింది. పోలాండ్లోని వ్రొక్లా, నెదర్లాండ్స్లోని క్రొనెన్బర్గ్, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, బెల్జియంలోని మిచెలిన్లో జరిగిన పోటీల్లో అనుష్ అదరగొట్టాడు.
దాంతో, ఈ ఏడాది జూన్లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల బెర్తు కొల్లగొట్టాడు. అయితే.. భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య చివరి ట్రయల్ నిర్వహించాకే విశ్వ క్రీడల్లో పాల్గొనేవాళ్ల పేర్లను ప్రకటించనుంది.’దేశం తరఫున ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించినందుకు చాలా గర్వంగా, గొప్పగా అనిపిస్తోంది. ఒలింపిక్స్లో పోటీ పడాలనేది నా చిన్నప్పటి కల.
𝗢𝗹𝘆𝗺𝗽𝗶𝗰 𝗤𝘂𝗼𝘁𝗮! ✅
Anush Agarwalla earns a place for Team India in Equestrian (Individual Dressage) at #Paris2024 🏇
Congratulations!#RoadToParis2024 | #OlympicQualifiers | @WeAreTeamIndia
— Olympic Khel (@OlympicKhel) February 19, 2024
విశ్వక్రీడల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం మర్చిపోలేని ఫీలింగ్. ఎప్పటిలానే ఫోకస్గా ఉంటా. మరింత కష్టపడుతా. చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకెళుతా’ అని 24 ఏండ్ల అనుష్ తెలిపాడు. నిరుడు చైనా వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో అనుష్ చరిత్ర సృష్టించాడు. ఈక్వెస్ట్రియన్ పోటీల్లో దేశానికి తొలి కాంస్య పతకం అందించాడు.
ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో అనుష్
ఇప్పటివరకూ భారత్ నుంచి నలుగురు మాత్రమే ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో పోటీ పడ్డారు. దర్యా సింగ్ 1980 మాస్కో ఒలింపిక్స్లో బరిలోకి దిగి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ లంబా (1996 అట్లాంటా), ఇంతియాజ్ అనీస్(2000 సిడ్నీ), ఫౌవాద్ మిర్జా(2022 టోక్యో)లు విశ్వ క్రీడల్లో పాల్గొన్నారు.