Prithvi Shaw : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) బెంచ్కే పరిమితం అవుతున్నాడు. విధ్వంసక ఆటగాడిగా పేరున్న షా ఈసారి ఒక్క మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్ తారగా వెలుగొందిన పృథ్వీ.. ఇప్పుడు పేలవమైన ఆటతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్లోనైనా దంచుతాడనుకుంటే ఈసారి 198 రన్స్తో నిరాశపరిచాడు. టెక్నిక్ పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న షాకు పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ (Wasim Akram) ఓ సలహా ఇచ్చాడు.
దేశవాళీలో ఆడి.. షా తన ఫుట్వర్క్, టెక్నిక్ను మెరుగుపర్చుకోవాలని అక్రం సూచించాడు. అంతేకాదు పార్టీలు మానేసి ఆటపై ఫోకస్ పెట్టాలని.. అప్పుడే పృథ్వీ షా సక్సెస్ అవుతాడని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ‘క్రికెట్ మీద దృష్టి పెట్టు. పార్టీలపై కాదు. రిటైర్మెంట్ అయ్యాక ఎన్ని పార్టీలైనా చేసుకోవచ్చు. అప్పుడు నిన్ను ఎవరూ అడుగరు. షాలో అత్యుత్తమ క్రికెట్ ఆడగల సత్తా ఉంది. అందుకని అతడు ఆటపైనే దృష్టి పెట్టాలి’ అని అక్రమ్ ఢిల్లీ ఓపెనర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యాలు చేశాడు.
పదిహేడో సీజన్లో ఢిల్లీ అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) అద్భుతంగా రాణిస్తుంటే.. ఓపెనర్లుగా జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, అభిషేక్ పొరెల్లు అదిరే ఆరంభాలు ఇస్తుండగా.. మిడిల్ ఆర్డర్లో పంత్, అక్షర్ పటేల్, స్టబ్స్లు దంచికొడుతున్నారు.
ICYMI: TriStorm unleashed at Qila Kotla tonight ⚡pic.twitter.com/HmW0hIn4mt
— Delhi Capitals (@DelhiCapitals) May 7, 2024
ఇక బౌలింగ్ యూనిట్లో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్, యువకెరటం రసిక్ సలాం దార్లు ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. దాంతో, ఆరు విజయాలు సాధించిన ఢిల్లీ 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు పోటీగా మారింది. పంత్ సేన తర్వాతి రెండు మ్యాచుల్లో ఆర్సీబీ, లక్నోతో ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తే.. ఈసారి ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరే చాన్స్ ఉంది.