హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఓ కారు బీభత్సం సృష్టించింది. మితివీగిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద అదుపుతప్పి ఓఆర్ఆర్పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఘటనా స్థలంలో ఒకరు మరణించగా, దవాఖానకు తరలిస్తుంగా మరొకరు చనిపోయారని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మరో ఘటనలో జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్న పెండ్యాల వద్ద ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును వెలికితీశారు. మృతుడిని నాగరాజుగా గుర్తించారు.