Smriti Mandhana : స్మృతి మంధాన… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏండ్ల ట్రోఫీ కలను నిజం చేసింది. దాంతో మంధానపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ ట్రోఫీ బెంగ తీర్చిన ఆమెను ఏకంగా విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పోల్చుతున్నారు. కానీ, మంధాన మాత్రం పొగడ్తలకు పొంగిపోవడం లేదు. డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచినంత మాత్రాన తాను గాల్లో తేలిపోవట్లేదని చెప్పింది. అంతేకాదు గొప్ప క్రికెటర్ అయిన కోహ్లీతో తనను పోల్చడం సరికాదని స్పష్టంగా చెప్పేసింది. కోహ్లీ తన 16 ఏండ్ల కెరీర్లో ఎంతో సాధించాడని మంధాన తెలిపింది.
‘టైటిల్ గెలవడం అనేది గొప్ప విషయమే. అయితే.. టీమిండియా తరఫున కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లీతో నన్ను పోల్చడం సరికాదు. అతడి కెరీర్తో చూసుకుంటే నా కెరీర్ చాలా చిన్నది. అందుకనే కోహ్లీతో పోలికను నేను అంగీకరించను. అతడొక మా అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. డబ్ల్యూపీఎల్ టైటిల్ అన్నింటినీ మార్చేయలేదు. అతడంటే మా అందరికీ ఎంతో గౌరవం’ అని మంధాన వెల్లడించింది.
— priyam ~ media account (@dunkimedia) March 19, 2024
It had to be him, no better feeling than celebrating this with the man who’s done so much for this franchise from its inception! 🥹❤🔥#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #ViratKohli pic.twitter.com/gdce2cPpB2
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
అంతేకాదు మా ఇద్దరి జెర్సీ నంబర్ 18 అయినంత మాత్రాన ఇద్దరమూ దిగ్గజాలం అయిపోముగా అని అంది. జెర్సీ ఒకటే అయినా మా ఇద్దరి ఆట తీరు ఒకేలా ఉండదని కూడా చెప్పింది. 18వ నంబర్ జెర్సీ తీసుకోవాలనేది నా చాయిస్ అని మంధాన తెలిపింది.
Red & Gold, now with some extra gold 🥹#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 pic.twitter.com/RESAap0mm6
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
డబ్య్యూపీఎల్ తొలి సీజన్లో నిరాశపరిచిన ఆర్సీబీ రెండో సీజన్లో ఏకంగా చాంపియన్గా అవతరించింది. మార్చి 17న ఢిల్లీలో జరిగిన ఫైనల్లో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. 19.3 ఓవర్లలోనే 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి తొలిసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. దాంతో, ఆర్సీబీ 16 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్లో మూడుసార్లు బెంగళూరు ఫైనల్ చేరినా.. కప్పు కొట్టలేకపోయింది. కానీ, అమ్మాయిల బృందం మొదటి ఫైనల్లోనే ట్రోఫీని పట్టేసి ఔరా అనిపించింది.