న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీ(Sanjay Mukherjee)ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రధాన కార్యదర్శికి ఈసీఐ లేఖ రాసింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులపై సోమవారం వేటు వేసింది. అయితే తొలుత బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో వివేక్ సహాయ్ను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఒక్క రోజు తేడాలోనే మళ్లీ ఈసీ కొత్త డీజీపీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ECI appoints Sanjay Mukherjee as the new DGP of West Bengal. pic.twitter.com/Al6ehH1k9I
— ANI (@ANI) March 19, 2024