Kodangal | కొడంగల్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నియోజకవర్గం పరిధిలోని బొంరాస్పేట్కు వివిధ గ్రామాల నుంచి బస్సులు అందుబాటులో లేవు. సకాలంలో ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో.. విద్యార్థినులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో పరీక్షా కేంద్రాలకు టాటా ఏస్ వాహనాలు, ఆటోల్లో వెళ్తున్నారు విద్యార్థినులు. ప్రయివేటు వాహనాల్లో స్థాయికి మించి విద్యార్థినులు ప్రయాణిస్తున్నారు. ఇక ప్రయివేటు వాహనదారులు కూడా అందినకాడికి దోచుకుంటున్నారు.