INDW vs AUSW : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత అమ్మాయిలు దంచికొడుతున్నారు. ఏకంగా ముగ్గురు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో, టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(74 : 106 బంతుల్లో 12 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్( 52 నాటౌట్ : 87 బంతుల్లో6 ఫోర్లు), రీచా ఘోష్(50 నాటౌట్ : 99 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకాలతో కదం తొక్కారు.
మంధాన ఔటయ్యాక కొంసేపు జెమీమా, రీచా కొద్ది సేపు ఆచితూచి ఆడారు. కుదరుకున్నాక వేగం పెంచారు. ఫామ్లో ఉన్న జెమీమ అలనా కింగ్ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిరెండో అర్ధ శతకం ఖాతాలో వేసుకుంది. రీచా ఘోష్తో కలిసి నాలుగో వికెట్కు కీలకమైన సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ 31 పరుగుల ఆధిక్యంలో ఉంది.
– A second fifty in her second Test for Jemimah Rodrigues
– A fifty on Test debut for Richa GhoshNo experience? No problem for the Indian youngsters 👏https://t.co/uaFLxAnKj5 | #INDvAUS pic.twitter.com/vVCRH1AUKt
— ESPNcricinfo (@ESPNcricinfo) December 22, 2023
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బౌలర్లు మరోసారి తమ తడాఖా చూపించారు. వస్త్రాకర్,స్నేహ్ రానా దెబ్బకు కంగారూ జట్టు 219 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఓపెనర్లు షఫాలీ వర్మ(40), మంధాన(74) శుభారంభం ఇచ్చారు.
A fine knock, but it’s heartbreak for Smriti Mandhana so close to her second Test hundred 💔 https://t.co/uaFLxAnKj5 | #INDvAUS pic.twitter.com/VFq7FcokOB
— ESPNcricinfo (@ESPNcricinfo) December 22, 2023
తొలి వికెట్కు వీళ్లు 90 రన్స్ జోడించారు. షఫాలీ ఔటయ్యాక వచ్చిన స్నేహ్ రానా(9) రెండో రోజు తొలి సెషన్లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత మంధాన, జెమీమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. హాఫ్ సెంచరీ బాదిన మంధాన రనౌట్ అయ్యి డగౌట్కు చేరింది.