అమరావతి : తెలుగుదేశం పాలనలో ముస్లింలకు న్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) అన్నారు. నెల్లూరులో షాదీ మంజిల్లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. టీడీపీ పాలన లో న్యాయం జరిగిందా. వైసీపీ హయాంలో న్యాయం జరిగిందా ప్రజలు గ్రహించాలని సూచించారు. ప్రజల కోసం పరిపాలన ఉండాలని, స్వార్థం కోసం ప్రజలను దోచుకునే పార్టీలు అధికారంలోకి వస్తే మనుగడ కష్టమని హితవు పలికారు.
ఎన్డీయేలో ఉన్పప్పుడు ముస్లింలను కాపాడుకున్నాం. ఐదేండ్ల వైసీపీ జగన్ ( YS Jagan) పాలనలో రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ లేదని ఆరోపించారు. హజ్ యాత్ర (Haj Yatra )కు వెళ్లే ముస్లింలకు రూ. లక్ష ఇస్తామని అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతానని,మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. నా జీవితం పేదలకు అంకితమని వెల్లడించారు .