Special Trains | తిరుపతి-శ్రీకాకుళం రోడ్, యశ్వంతపూర్-గయా మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి సెలవుల నేపథంలో రద్దీకి అనుగుణంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.
తిరుపతి – శ్రీకాకుళం రోడ్ (07440) మధ్య మే 5, 12 తేదీల్లో, శ్రీకాకుళం-తిరుపతి మధ్య మే 6, 13 తేదీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. తిరుపతి-శ్రీకాకుళం-తిరుపతి ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడురు, ఒంగోల్, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగుతుందని పేర్కొంది.
యశ్వంత్పూర్ – గయా (06217) ఈ నెల 27 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం, గయా – యశ్వంత్పూర్ మధ్య ఈ నెల 29 నుంచి 27 మే వరకు ప్రతి సోమవారం రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ తెలిపింది. రైళ్లు రెండుమార్గాల్లో రేణిగుంట, గూడురు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండి, సామర్లకోట, అనకాలపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపెల్లి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.