ఈ ఐపీఎల్ సీజన్లో కొత్తగా చేరిన గుజరాత్, లక్నో జట్లు మరోసారి బరిలో సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు ఈ రెండు జట్లు పోటీ పడినప్పుడు గుజరాత్ జట్టు విజయకేతనం ఎగరేసింది. మరి ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి. మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
జట్టులో మూడు మార్పులు చేసినట్లు చెప్పాడు. లోకీ ఫెర్గూసన్, సాయి సుదర్శన్, సంగ్వాన్ ఆడటం లేదని చెప్పాడు. వాళ్ల స్థానాల్లో మాథ్యూ వేడ్, యష్ దయాళ్, సాయి కిషోర్ ఆడుతున్నట్లు చెప్పాడు. తమ జట్టులో కూడా ఒక మార్పు చేసినట్లు లక్నో సారధి కేఎల్ రాహుల్ చెప్పాడు. రవి బిష్ణోయి స్థానంలో కరణ్ శర్మ ఆడుతున్నట్లు వెల్లడించాడు.
గుజరాత్ టైటన్స్: శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్, మహమ్మద్ షమీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, దుష్మంత చమీర
#GujaratTitans have won the toss and they will bat first against #LSG.
Live – https://t.co/45TbqyBfE3 #LSGvGT #TATAIPL pic.twitter.com/pQB53PfPD3
— IndianPremierLeague (@IPL) May 10, 2022