WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్(WPL 2024)లో టైటిల్ పోరుకు కౌంట్డౌన్ మొదలైంది. డబ్ల్యూపీఎల్ కొత్త చాంపియన్ ఎవరో మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు షాకిచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) తొలిసారి ఫైనల్ ఆడుతోంది. ఐపీఎల్లోనూ మూడుసార్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడిన ఆర్సీబీ.. ఈసారి కప్పు కొట్టాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదరుచూస్తున్నారు. అదే జరిగితే బెంగళూరు తరఫున టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్గా స్మృతి మంధాన చరిత్ర సృష్టిస్తుంది.
అవును.. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫేవరేట్. క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే (Anil Kumble), డానియల్ వెటోరీ(Daniel Vettori), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు ఆర్సీబీని ఫైనల్కు తీసుకెళ్లారు. కానీ, మూడుసార్లు బెంగళూరు ఫైనల్లో చేతులేత్తేసింది. ఒత్తిడిని తట్టుకోలేక ప్రత్యర్థికి ట్రోఫీని అప్పగించేసింది. ఐపీఎల్లో దురదృష్టానికి కేరాఫ్ అయిన ఆర్సీబీ.. మహిళల ప్రీమియర్ లీగ్లో చాంపియన్గా నిలుస్తుందా? లేదా? చూడాలి.
The Captains are 𝗥𝗘𝗔𝗗𝗬 for the summit clash 🏆
ARE. YOU❓ #TATAWPL | #DCvRCB | #Final | @DelhiCapitals | @RCBTweets | @mandhana_smriti pic.twitter.com/Na4UY55Sy4
— Women’s Premier League (WPL) (@wplt20) March 16, 2024
స్టార్లకు కొదవలేని ఆర్సీబీ ఈ 16 ఏండ్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడుసార్లు ఫైనల్ చేరినా అభిమానులకు గుండెకోతనే మిగిల్చింది. కుంబ్లే సారథ్యంలోని ఆర్సీబీ 2009 ఎడిషన్లో ఫైనల్కు వెళ్లింది. దక్షిణాఫ్రికా వేదికగా దక్కన్ చార్జర్స్తో జరిగిన టైటిల్ పోరులో బెంగళూరు తడబడింది. 143 పరుగుల ఛేదనలో 137కే పరిమితమైంది. దాంతో, ఆడం గిల్క్రిస్ట్ నేతృత్వంలోని దక్కన్ చార్జర్స్ 6 పరుగుల తేడాతో గెలుపొంది తొలి టైటిల్ను ఎగరేసుకుపోయింది.
ఇక 2011లో డానియల్ వెటోరీ జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. దాంతో, కప్పు గ్యారంటీ అనుకున్నారంతా. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2016 ఎడిషన్లో కెప్టెన్ కోహ్లీ ఓ రేంజ్లో ఆడాడు. విరాట్ నాలుగు సెంచరీలతో చెలరేగడంతో ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది.
అయితే.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో కోహ్లీ సేనకు గుండెకోతే మిగిలింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని సన్రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని తన్నుకుపోయింది. దాంతో, కోట్లాది మంది ఆర్సీబీ ఫ్యాన్స్ మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు.
తొలి సీజన్లో నిరాశపరిచిన ఆర్సీబీ రెండో సీజన్లో అదరగొట్టింది. కెప్టెన్ మంధాన, ఆల్రౌండర్లు ఎలీసా పెర్రీ, శ్రేయాంక పాటిల్, వరేహమ్లతో పాటు రీచా ఘోష్ రాణించడంతో ప్లే ఆఫ్స్ చేరింది. ఎలిమినేటర్ పోరులో పెర్రీ ఖతర్నాక్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. శ్రేయాంక తన మ్యాజిక్ స్పెల్తో ముంబైని కట్టడి చేసింది.
The whole team came to the party last night but if we had to pick one, we’d pick two.
Perry’s prowess and Sherry’s spell 🤌#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #MIvRCB @EllysePerry @shreyanka_patil pic.twitter.com/34eNgtjSJ1
— Royal Challengers Bangalore (@RCBTweets) March 16, 2024
తొలిసారి ఫైనల్ చేరిన మంధాన సేన చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది. అయితే.. ఫైనల్లో ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది. నిరుడు రన్నరప్తో సరిపెట్టుకున్న ఢిల్లీ.. ఈసారి ట్రోఫీ వదలొద్దనే కసితో ఉంది. ఆర్సీబీ కప్పు కొట్టాలంటే ఢిల్లీ ఓపెనర్లు మేగ్ లానింగ్, షఫాలీ వర్మతో పాటు ఫామ్లో ఉన్న అలిసే క్యాప్సేల దూకుడుకు బ్రేక్ వేయాలి.
The girls believed, they manifested, and they made it to the final of #WPL2024. Sensational effort to successfully defending the lowest score in the two years of #WPL, that too against the defending champions Mumbai. Find out what emotions the players were going through in the… pic.twitter.com/Wx6zCzMgCZ
— Royal Challengers Bangalore (@RCBTweets) March 16, 2024