హైదరాబాద్ : కండ్లముందే కన్నతండ్రి నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు(Daughter died) మరణించింది. గుండెలను పిండివేసే ఈ విషాదకర సంఘటన ములుగు(Mulugu) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ములుగు జిల్లా మంగపేట మండలంలో కమలాపురానికి చెందిన నిఖిత సమీపంలోని గోదావరి నది(Godavari river) వద్దకు తండ్రితో వెళ్లింది.
అయితే తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న కుమార్తె చేయి అందించి బయటకు లాగింది. ఇదే క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది. బాలిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.