Bhavani Devi | ఫుజైర: మూడేండ్ల క్రితం టోక్యో (జపాన్) వేదికగా ముగిసిన ఒలింపిక్స్లో భాగంగా భారత్ తరఫున ఫెన్సింగ్ ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవీ పారిస్ ఒలింపిక్స్ బెర్తును దక్కించుకోవడంలో విఫలమైంది.
యూఏఈలోని ఫుజైర వేదికగా జరుగుతున్న ఆసియా ఒషియానియా జోనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఆమె సెమీస్లోనే నిష్క్రమించింది. ఈ టోర్నీ ఫైనల్లో గెలిచిన విజేతలు మాత్రమే విశ్వక్రీడలకు అర్హత సాధించనుండగా ఒలింపిక్స్కు ఇవే చివరి క్వాలిఫయర్స్.