Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలీ (Raebareli) లోక్సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమేథి నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi), రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పోటీ చేస్తారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ఎన్నికల్లో (Lok Sabha elections) ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనాలని కాంగ్రెస్ నాయకురాలు నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. రాహుల్ మాత్రం అమేథి (Amethi ) లేదా రాయ్బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని.. ఈ అంశంపై 24 గంటల్లో తుది నిర్ణయం వెలువడనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మరోవైపు అమేథి నుంచి పోటీకి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్కు పట్టున్న రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 2004 నుంచి 2019 వరకు సోనియానే గెలుపొందారు. ఇటీవల సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్బరేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంక బరిలోకి దిగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక అమేథి గాంధీ కుటుంబానికి కంచుకోట అన్న విషయం తెలిసిందే. గతంలో ఈ స్థానం నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు ప్రాతినిథ్యం వహించారు. అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అమేథితోపాటు పోటీ చేసిన వయనాడ్లో మాత్రం రాహుల్ గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా రాహుల్ వయనాడ్ నుంచి పోటీకి దిగారు. ఈ స్థానినిక ఇప్పటికే ఎన్నికలు కూడా జరిగాయి. ఇక వయనాడ్తోపాటు అమేథి లేదా రాయ్బరేలి నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు మే 3 చివరి తేదీ.
Also Read..
North Carolina | అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు వెళ్లిన వారిపై కాల్పులు.. ముగ్గురు అధికారులు మృతి
Bomb Threat | భోపాల్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు