Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఉదయం రాజస్థాన్లోని జైపూర్ (Jaipur), మహారాష్ట్రలోని నాగ్పూర్ (Nagpur) , గోవా విమానాశ్రయాలకు (Goa airports) ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎయిర్పోర్ట్కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ విమానాశ్రయానికి (Bhopal Airport) గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టినట్లు గాంధీ నగర్ పోలీసులు తెలిపారు. ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విశాల్ కుమార్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు (Police Launch Probe) వెల్లడించారు.
Also Read..
Patanjali | పతంజలికి మరో షాక్.. ఆ 14 ఉత్పత్తుల లైసెన్స్ రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
Accident | రహదారులు రక్తసిక్తం.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం
Laapataa Ladies | ఓటీటీలో దూసుకుపోతున్న అమీర్ ఖాన్ ‘లాపతా లేడీస్’