హైదరాబాద్ : పబ్లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. కత్తితో(Knife) దాడికి పాల్పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పబ్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాయదుర్గం పబ్లో(Rayadurgam Pub) సర్వర్గా పని చేస్తున్న కృతిక్(23) అదే పబ్లో బౌన్సర్గా(Bouncer )పని చేస్తున్న ఆరిఫ్ మధ్య గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన బౌన్సర్ ఆరిఫ్ కృతిక్తో పాటు అతని అన్న మల్లికార్జున్(24), స్నేహితుడు కళ్యాణ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అందులో మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉండగా కళ్యాణ్కు చేతికి, కాలుపై గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడ్డ ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.