Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
దేశ వ్యాప్తంగా 85 ఏండ్ల వయసు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. ఇందులో 40 శాతం మంది ఓటర్లు దివ్యాంగులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు వేయాలనుకున్న వారికి పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లు సహాయం చేస్తారని, వీల్ చైర్స్, రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక వందేండ్లు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది ఉన్నారు.