TS SSC Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 98.71 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు గురుకుల విద్యార్థులు. టీఎస్ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పరిషత్, గవర్నమెంట్, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం 91.31 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి.
3,927 స్కూల్స్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పాసైన వారిలో 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. విద్యార్థులు https://www.ntnews.com, https:// telanganatoday.com వెబ్సైట్లను సంప్రదించవచ్చు.