IPL 2024 RCB vs PBKS : ఐపీఎల్ పదిహేడో సీజన్ను ఓటమితో ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(77) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. దినేశ్ కార్తిక్(28 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ లొమ్రోర్(17 నాటౌట్)లు అసమాన పోరాటంతో ఆర్సీబీకి తొలి విజయం అందించారు.
పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో బెంగళూరు ఓపెనర్ కోహ్లీ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. అయితే.. రబాడ 26 పరుగుల వద్ద కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(3) ను ఔట్ చేసి పంజాబ్కు బ్రేక్ ఇచ్చాడు. అయినా కోహ్లీ జోరు మాత్రం తగ్గలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అర్ష్దీప్ సింగ్ ఓవర్లో అతడు ఏకంగా మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ నాలుగు ఓవర్లకే 40 దాటింది. కానీ, ఆ తర్వాతి ఓవర్లో రబాడ సూపర్ డెలివరీతో డేంజరస్ కామెరూన్ గ్రీన్(3)ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే మ్యాక్స్వెల్(3) బౌల్డ్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ లొమ్రోర్(17 నాటౌట్), దినేశ్ కార్తిక్(28 నాఔట్)లు చివరిదాకా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ(77) కొద్దిలో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. స్లిప్లో బెయిర్స్టో క్యాచ్ జారవిడిచాడు. ఆ తర్వాత విరాట్ వరుసగా మూడు బౌండరీలతో చెలరేగాడు. ఆఖరి బంతిని ఫోర్గా మలిచి 16 పరుగులు రాబట్టాడు. హర్ప్రీత్ బ్రార్ ఇద్దరినీ బౌల్డ్ చేసి పంబాజ్ను పోటీలోకి తెచ్చాడు. కానీ, విరాట్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Harshal Patel with a HUGE wicket and @PunjabKingsIPL are back in this!
Virat Kohli departs after a well-made 77 off 49 👏👏#RCB need 47 off 24
Head to @Jiocinema & @Starsports to watch the match LIVE #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/T84j0yycWa
— IndianPremierLeague (@IPL) March 25, 2024
హర్షల్ పటేల్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన విరాట్.. భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద హర్ప్రీత్ బ్రార్ చేతికి చిక్కాడు. అప్పటికీ ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 47 రన్స్ కావాలి. కానీ అనుజ్ రావత్ (11) ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, బెంగళూరు స్టేడియం నిశబ్దంగా మారింది.
What a finish 🔥
What a chase 😎An unbeaten 44*-run partnership between @DineshKarthik and @mahipallomror36 wins it for the home team 💪@RCBTweets register a 4-wicket win!#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/E1cyTIEZp7
— IndianPremierLeague (@IPL) March 25, 2024
తొలుత కెప్టెన్ శిఖర్ ధావన్(45), జితేశ్ శర్మ(27), సామ్ కరన్(23) లు బ్యాట్ ఝులిపించడంతో పంజాబ్ 176 రన్స్ కొట్టింది. అయితే.. వరుస ఓవర్లో లివింగ్స్టోన్(15), ధావన్ ఔట్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 98 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టును సామ్ కరన్(23).. జితేశ్ శర్మ(27)లు ఆదుకున్నారు. వీళ్లు ఐదో వికెట్కు 52 రన్స్ జోడించారు. ఒకదశలో 150లోపే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ, ఆఖరి ఓవర్లో శశాంక్ సింగ్(20 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్లు తలా రెండేసి వికెట్లు పడగొట్టగా జోసెఫ్ ఒక వికెట్ తీశాడు.