అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద కారు (Car) అదుపు తప్పి లారీ (Lorry) ని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విశాఖనగరం గోపాలపట్నం వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.