IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో కష్టాల్లో పడిన జట్టును జో రూట్(67 నాటౌట్) ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన అతడు హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆరో వికెట్కు బెన్ ఫోక్స్(28 నాటౌట్)తో కీలక భాగస్వాయ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన వీళ్లిద్దరూ 221 బంతుల్లో 86 రన్స్ జోడించారు. దాంతో, ఇంగ్లండ్ టీ సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. రూట్, ఫోక్స్ పట్టుదలగా ఆడడంతో లంచ్ తర్వాత సెషన్లో ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు.
టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ సేన తొలి రోజు మొదటి సెషన్లోనే తడబడింది. అరంగేట్రం పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో తొలి సెషన్లోనే ఐదు వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలే(42), బెన్ డకెట్(11), ఓలీ పోప్(0)లు స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు.
End of Second Session in Ranchi on Day 1!
England move to 198/5 at Tea.
Third & Final Session of the Day to commence soon.
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/oTrVNsd959
— BCCI (@BCCI) February 23, 2024
ఆ తర్వాత జానీ బెయిర్స్టో(38) బజ్ బాల్ తరహాలో చెలరేగాడు. ప్రమాదకరంగా మారుతున్న అతడిని అశ్విన్ ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపట్లో లంచ్ అనగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్(3)ను జడేజా ఎల్బీగా వెనక్కి పంపాడు. 112 5తో లంచ్కు వెళ్లిన ఇంగ్లండ్ రూట్, ఫోక్స్ అద్వితీయ పోరాటంత గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతోంది.