తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల(Tirumala) కు చేరుకున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు (Compartments) భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 57,973 మంది భక్తులు దర్శించుకోగా 21,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.95 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు విహారం
తిరుపతి గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో (Teppostavam) భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునిక్రిష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.