IND vs ENG : స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్(T20 Series)లో తేలిపోయిన భారత మహిళల జట్టు(Womens Team) తొలి టెస్టులో సత్తా చాటింది. ఏకంగా మిడిలార్డర్లోని నలుగురు బ్యాటర్ల హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హర్మన్ప్రీత్ కౌర్(HarmanPreet Kaur) సేన 7 వికెట్ల నష్టానికి 410 రన్స్ కొట్టి పటిష్ట స్థితిలో నిలిచింది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం(DY Patil Stadium)లో జరుగుతున్న మ్యాచ్లో సుభా సతీశ్(69), జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(60 నాటౌట్) అర్ధ శతకాలతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆట ముగిసే సమయానికి పూజా వస్త్రాకర్(4) క్రీజులో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లతో రాణించింది.
India put up a strong batting performance on the first day in Mumbai 💥#INDvENG | 📝: https://t.co/b2of36X8r5 pic.twitter.com/HSy3t2TNKk
— ICC (@ICC) December 14, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. దాంతో, కష్టాల్లో పడిన జట్టును సుభా సతీశ్, జెమీమా రోడ్రిగ్స్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ క్రీజులో పాతుకుపోయి ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
🧢 Satheesh Shubha
🧢 Jemimah Rodrigues
🧢 Renuka SinghThree players receive their first 🇮🇳 Test cap as they make their debut against England!#INDvENG pic.twitter.com/YpYcIb2trk
— ICC (@ICC) December 14, 2023
మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 115 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్(49) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. యస్తికా భాటియా, దీప్తి శర్మ ధనాధన్ ఆటతో ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించారు. దాంతో, టీమిండియా తొలి రోజే 410 రన్స్ కొట్టింది. ఈ మ్యాచ్తో సతీశ్ సుభా, జెమీమా రోడ్రిగ్స్, పేసర్ రేణుకా సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.