Ravindra Jadeja : సొంత మైదానంలో దేశం తరఫున ఆడడం ప్రతి క్రికెటర్కు మర్చిపోలేని ఫీలింగ్. అలాంటిది అదే మైదానంలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపిస్తే.. ఆ ఆటగాడి ఆనందానికి అవధులే ఉండవనుకో. ప్రస్తుతం టీమిండయా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అదే సంతోషంలో ఉన్నాడు. సొంత గ్రౌండ్ అయిన రాజ్కోట్(Rajkot)లో జడ్డూ.. ఆల్రౌండ్ షోతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొలి ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీ బాదిన జడేజా బ్యాటు సాముతో ఫ్యాన్స్ను అలరించాడు. ఆ తర్వాత బంతితోనూ రాణించి ఐదు వికెట్లతో ఇంగ్లండ్ ఆట కట్టించాడు. చివరి వికెట్గా మార్క్ వుడ్ను ఔట్ చేసిన జడేజా.. తన కెరీర్కు పునాది రాయి అయిన రాజ్కోట్ పిచ్ను ప్రేమగా ముద్దాడాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
జడేజా(112), రోహిత్ శర్మ(132)
It’s @imjadeja with the final breakthrough 😎 #TeamIndia win the 3rd Test by 434 runs! 👏👏
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/A4juPRkWX8
— BCCI (@BCCI) February 18, 2024
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఏ దశలోనూ గెలుపు కోసం పోరాడలేదు. బుమ్రా, స్పిన్నర్ జడేజా దెబ్బకు వచ్చిన వాళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్లో ఓలీ పోప్(3), జో రూట్(7), జానీ బెయిర్స్టో(4), బెన్ ఫోక్స్(15)తో పాటు మార్క్ వుడ్(33)లను ఔట్ చేసిన జడేజా 5 వికెట్లు ఖతాలో వేసుకున్నాడు. దాంతో భారత జట్టు 434 పరుగుల భారీ విజయం నమోదు చేసి సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జడేజా 10వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 23న రాంచీలో నాలుగో టెస్టు జరుగనుంది.