జగిత్యాల : జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ను(Bajireddy Govardhan) భారీ మెజార్టీతో గెలిపించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో(Parliament Elections) భాగంగా ఆదివారం బాజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, రోటరీ పార్క్, ధరూర్ క్యాంప్లలో వాకర్లను, వాకర్ అసోసియేషన్ సభ్యులు, యువకులను కలిశారు.
వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. పట్టణాభివృద్ధికి అందరు సహకరించాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాజిరెడ్డి గోవర్దన్ ప్రచారంలో వేగం పెంచారు. ఇలిల్లు తిరుగుతూ చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.