Sai Durgha Tej | విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కామ్బ్యాక్ ఎంట్రీ ఇచ్చాడు సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తోపాటు వసూళ్లు రాబట్టింది. ఈ మెగా హీరో విరూపాక్ష తర్వాత పవన్కల్యాణ్తో కలిసి బ్రో సినిమాలో మెరిశాడు. ఈ రెండు సినిమాల తర్వాత సాయిదుర్గతేజ్ చేస్తున్న ప్రాజెక్ట్పైనే ఇప్పుడు అందరి ఫోకస్ పడ్డది. సాయిదుర్గతేజ్ నెక్ట్స్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
డెబ్యూ డైరెక్టర్ రాకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 1940 బ్యాక్డ్రాప్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. విరూపాక్ష తర్వాత కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వని సాయి దుర్గ తేజ్ షూటింగ్ అప్డేట్ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ ఏడాది జులై సెట్స్పైకి వెళ్తనుంది. లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు, ఫాలోవర్లు.