Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాస్తవ అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను తన ప్రసంగ పాఠాలను రాసే వారు రూపొందించారనే భ్రమలో ప్రధాని మోదీ ఉన్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను మాత్రమే మోదీ చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యాం పిట్రోడా ప్రతిపాదించిన వారసత్వ పన్ను వ్యాఖ్యలు, సంపద పున:పంపిణీ అంశాలను ప్రధాని మోదీ పదేపదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడతున్న నేపధ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించడం సరైంది కాదని చిదంబరం ఆక్షేపించారు. మరోవైపు వారసత్వ పన్నుకు సంబంధించి శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోపై మోదీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Read More :
Gajwel | ఇది ఐలవ్వ మాట.. ఇప్పుడే ఎలచ్చన్ పెడితే కేసీఆరే అస్తడు