Team India : వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు(Team India) తొలి విదేశీ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా(South Africa) చేరుకుంది. అక్కడ టీమిండియా మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. అయితే.. బుధవారం కొందరు ఆటగాళ్లు వ్యక్తిగత కారణాల వల్ల సఫారీ గడ్డకు బయల్దేరలేదు. వాళ్లు ఎవరంటే..? స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja), ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill), పేసర్ దీపక్ చాహర్(Deepak Chahar). ఈ ముగ్గురు త్వరలోనే జట్టుతో కలువనున్నారని బీసీసీఐ వెల్లడించింది.
వరల్డ్ కప్ తర్వాత జడేజా కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లాడు. టీ20 సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన జడ్డూ మరో రెండు రోజుల్లో జట్టుతో కలుస్తాడు. ఇక యంగ్ ఓపెనర్ గిల్ లండన్లో విహరిస్తున్నాడు. దీపక్ చాహర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అందుకని అతడు కొంచెం ఆలస్యంగా దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నాడు.
South Africa bound ✈️🇿🇦#TeamIndia are here 👌👌#SAvIND pic.twitter.com/V2ES96GDw8
— BCCI (@BCCI) December 7, 2023
సఫారీ గడ్డపై భారత జట్టు తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 10న ఇరుజట్లు తొలి మ్యాచ్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆలోపు ఈ ముగ్గురు జట్టుతో కలిసే అవకాశం ఉంది. శుక్రవారం టీమిండియా కింగ్స్మీడ్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననుంది. టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్.. ఆ వెంటనే రెండు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా, భారత్ తలపడనున్నాయి.